Sunday, May 19, 2024
- Advertisement -

జగన్‌ గెలుపుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే టీడీపీదే అధికారం అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సర్వే చేసిన నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ స్పందించారు. రాజమండ్రిలో నిర్వహించి మీట్‌ద ప్రెస్‌లో పాల్గొన్న ఆయన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని స్పష్టం చేశారు.

ఈ విషయం టీడీపీ వారికి కూడా తెలుసన్నారు. గ్రౌండ్‌ రియాలిటీ బట్టి చూస్తే జనం జగన్‌వైపు ఉన్నట్టుగా అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ఇమేజ్ ఇంత బలహీనంగా చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. అయితే ఎన్నికల విషయంలో చంద్రబాబును ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నారు.

ఎన్నికల మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం చంద్రబాబుకు ఉన్నంత స్థాయిలో జగన్‌కు లేదన్నారు ఉండవల్లి. అదే సమయంలో చంద్రబాబు వద్ద ఉన్నంత డబ్బు ప్రస్తుతం ఎవరి వద్ద లేదన్నారు. మేనేజ్‌మెంట్‌, డబ్బు అన్ని పక్కనపెట్టి చూస్తే ప్రస్తుతం పరిస్థితి వైసీపీకి అనుకూలంగా వన్‌సైడ్ ఉందన్నారు. పవన్‌ కల్యాణ్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు ఉండవల్లి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -