తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా ప్రజల డబ్బుని తినేస్తున్నారని.. ఆయనకి మరికొంతమంది సభ్యులు సహకరిస్తున్నరని నటుడు నరేష్ ఆరోపణలు చేశారు. శివాజీరాజా వర్గం మేము మోసం చేయలేదని అంటుంటే.. నరేష్ టీమ్ నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాలు తేల్చాలని కోరుతున్నారు.
దీంతో మా అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయారు.మొదట ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పెద్దలు అనుకున్నారు.కాని మా అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో విషయం కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి అసహనంగా ఉన్నారని సమాచారం.మొదట ఈ వివాదం చిరంజీవి దగ్గరికి వెళ్లినప్పుడు కొంత సమయం తీసుకొని గొడవలకు తావివ్వకుండా సమస్యను పరిష్కరించాలనుకున్నారు.
కాని ఇప్పుడు ఈ వివాదం పెద్దది కావడం,పైగా ఈ వివాదంలోకి చిరంజీవిని కూడా లాగడంతో ఆయన మా అసోసియేషన్పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది.సోషల్ మీడియాలో ఈ వివాదం మొత్తనికి చిరంజీవే కారణం అని వార్తలు ప్రత్యక్షం అవ్వడంతో ఆయన కాస్తా మనస్తాపనికి గురైయ్యారని సమాచారం.మా అసోసియేషన్ గొడవలోకి నన్ను లాగొద్దని ఆయన మా సభ్యులని కొరినట్లు తెలుస్తుంది.మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.