నల్గొండ జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టించింది ప్రణయ్ పరువు హత్య.అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేయించాడు అమ్మాయి తండ్రి.ప్రణయ్ దళితుడు కావడంతో అతడిని అల్లుడిగా స్వీకరించలేని అమృత తండ్రి ప్రణయ్ ని హత్య చేయించారు. గత రెండు, మూడు రోజులుగా ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఈ వివాదంపై సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ప్రణయ్ కోసం ఓ పాటను అంకితం చేసింది ‘వీర భోగ వసంతరాయలు’ సినిమా టీమ్.ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం ప్రేమకోసం బలైన వారికి ఈ పాటను అంకితమిస్తున్నామని తెలిపింది.ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులు హీరోలుగా కనిపించనున్నారు. మరో ముఖ్య పాత్రలో హీరోయిన్ శ్రియ కనిపించనుంది.