హర్షవర్ధన్ ఋతురాగాలు, అమృతం వంట సీరియల్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వెండితెరపై రాణిస్తున్న నటుడు. హర్షవర్ధన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హర్షవర్ధన్ నటుడే కాదు మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా. గుండెజారి గల్లంతయ్యిందే, మనం సినిమాలకు ఆయన మాటలు అందించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హర్షవర్ధన్ దర్శకుడిగా కూడా అరంగేట్రం చేస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాను ఏసియన్ సినిమాస్ సంస్థ నిర్మించనుంది. ఓ డిఫరెంట్ ఫన్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ఈ సినిమా తీయనున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కరుణ్ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేయనున్నారు.
ఈ సినిమాలు పూర్తయిన తర్వాత హర్షవర్ధన్- సుధీర్ బాబు కాంబినేషన్ లో సినిమా మొదలు కానున్నట్లు సమాచారం. ఏసియన్ మూవీస్ సంస్థ వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటికే నాగచైతన్య, నాగ శౌర్య హీరోలుగా లవ్ స్టోరీ, లక్ష్య సినిమాలు పూర్తి చేసింది. అలాగే శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబినేషన్ లో ఓ సినిమా, శివకార్తికేయన్ -అనుదీప్ కాంబినేషన్ లో మరో సినిమా నిర్మిస్తోంది.
Also Read
సోనూ సూద్ .. చెర్రీ మధ్య భీకర ఫైట్..! ప్లాన్ చేసిన కొరటాల..!