మాస్ రాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది.తాజాగా సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.. ‘ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి’ అని విలన్ చెప్పే మాటలు.. ‘మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం..’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్లు టీజర్కు హైలెట్ గా నిలిచాయి. ఇక చాలా రోజులు తరువాత తెలుగు సినిమాలో కనిపించి గోవా బ్యూటీ ఇలియానా.
కాస్త బొద్దుగా కనిపిస్తున్నా.. అందంగానే కనిపించింది ఇలియానా. టీజర్ని బట్టి ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయం తెలుస్తోంది.టీజర్ని చూస్తుంటే ఇది రివైంజ్ స్టోరీ అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా రవితేజకు ఖచ్చితంగా మరో హిట్ ఇస్తుందని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాని మంచి క్వాలిటీతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.