తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడవిడి పూర్తి అయింది.రాష్ట్రంలో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు నిర్వహించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.చిరంజీవి,ఎన్టీఆర్,మహేశ్ బాబు,అల్లు అర్జున్,మొదలగు వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్న వారిలో ఉన్నారు.ఇక్కడ వరకు బాగానే ఉంది కాని మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ‘‘ఓటు మనకు సంక్రమించిన హక్కు. ఇది ఒక వజ్రాయుధం లాంటిది. మనకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలన్నా.. నచ్చని పార్టీని దింపేయాలన్నా ఓటు ద్వారానే సాధ్యం.
దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒంట్లో బాగోలేకో.. కదల్లేని పరిస్థితుల్లోనో ఉన్నవాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉండి కూడా ఈ రోజును ఒక సెలవు దినంగానో.. ఎంజాయ్మెంట్ డేగానో పరిగణించి ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి వాళ్లను అస్సలు క్షమించకూడదు. ఓటు వేయని వారిని గాడిదలతో పోల్చారు నాగబాబు.అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు కన్నా ఓటు వేయనివారు చాలా దుర్మార్గులని తెలిపారు నాగబాబు.
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- రజనీకాంత్ అభిమానులకు గుడ్న్యూస్!
- ‘ఏషనాగుల’ అంటూ అదరగొట్టిన నాని, కీర్తి!
- ‘#KING 100’ గ్లింప్స్ వచ్చేసింది!
- ‘ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను’
