టాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరు రష్మిక మందన్న పేరే చెబుతారు.ఛలో సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక,గీతా గోవిందం సినిమాతో అందరిని తన బుట్టలో వేసుకుంది రష్మిక.ఇక నానితో నటించిన దేవదాస్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది రష్మిక.తాజాగా ఆమె చేసిన పనితో వార్తల్లో నిలిచింది.సాధారణంగా హీరోయిన్లు ఫోటోషూట్ అంటే ఏ కార్పెట్ మీదనే లేక సెట్లోనే చేస్తుంటారు.కాని రష్మిక అందరికంటే భిన్నంగా షోటోషూట్ చేసి చూపించింది.ఓ చెరువులో ఫోటోషూట్ చేసి సంచలనం రేపింది రష్మిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డీ.సన్మతి నేతృత్వంలో బెళ్లందూరు చెరువు నీటి లోపల తీయించుకున్న ఫోటోలను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన రష్మిక ఫోటోలతో పాటు సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.
బెళ్లందూరు చెరువులో ఇటువంటి పరిస్థితి నెలకొందనే విషయం ఫోటోషూట్ చేయించుకునే వరకు తమకు తెలియలేదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఎంతో అందంగా ఉన్న బెళ్లందూరు చెరువులో ప్రస్తుతం నెలకొన్న కాలుష్యాన్ని చూసిన అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ రష్మిక తెలిపారు. రష్మిక చేసి పనిని అందరు ప్రశంసిస్తున్నారు.ఎంత పని చేశావ్ రష్మిక కాలుష్యం ఉన్న చెరువులో దిగితే నీ స్కిన్ ఏమౌతుందో ఆలోచించావా అంటూ ఆమె ఫ్యాన్స్ రష్మికను ప్రశ్నిస్తున్నారు.రష్మిక చెరువులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
- Advertisement -
ఎంత పని చేశావ్ రష్మిక..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -