బాలీవుడ్ క్రేజ్ హీరోయిన్స్లో కియారా అద్వానీ. లాస్ట్ ఆఫ్ స్టోరీస్ సినిమాతో బాగా పాపులర్ అయింది కియారా అద్వానీ. తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కియారా. తెలుగులో మహేశ్ బాబు స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చింది. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
రామ్ చరణ్తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలవడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు. కియారా ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్లో నటిస్తుంది. తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి కియారా అద్వానీ ఓ సినిమా చేయనుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్గా తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఈ వార్త నిజం అయితే కనుక మరో క్రేజీ పెయిర్ తెర మీద కనిపించడం ఖాయం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టజర్ విడుదల అయింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -
కియారా అద్వానీని లైన్లో పెట్టిన విజయ్ దేవరకొండ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -