పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది బాబు, మోదీ మధ్య ట్విట్టర్ వార్ తారాస్థాయికి చేరింది. ఒకరి మీద ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు నవ్యాంధ్రలో మోదీ పర్యటన నేపథ్యంలో ఇద్దరి నేతల ట్వీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారు అవినీతి, కుటుంబ రాజకీయాలు కోరుకోవడం లేదు. అందువల్ల అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇది నా పూర్తి విశ్వాసం’ అని ఉదయం మోదీ ట్వీట్ చేశారు.
మోదీ ట్విట్కు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారని బాబు దుయ్యబట్టారు.నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఆర్థిక నేరస్తులు దేశం దాటేందుకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇద్దరి ట్వాట్లు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.