వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ఇండస్ట్రీలో తెలియని వారుండరు. వర్మ తీసె సినిమాలు అన్నీ వివాదాస్పాదాలతో రచ్చ రంబోల అవడం పరిపాటిగా మారింది. వివాదాలతోనె సినిమాకు ప్రమోషన్ష్ చేసుకోవడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. రాంగోపాల్ వర్మను ఉద్దేశించి ఏ చిన్న వ్యాఖ్య చేసినా.. ఆయన రియాక్ట్ అయ్యే తీరు మామూలుగా ఉండదు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంలో కాకమీదున్నారు వర్మ. సినిమా ప్రమోషన్లో భాగంగా బెజవాడలో వర్మ పెట్టాల్సిన ప్రెస్ మీట్ను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని స్పందించారు.
రామ్ గోపాల్ వర్మ ఒక సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. వర్మలాంటి సైకోకు వైసీపీ అధినేత జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించి విజయవాడ లో ప్రెస్ మీట్ పెట్టే అంశంపై వర్మకు జగన్ మద్దతు పలకటం తెలిసిందే. తనపై కాసింత సీరియస్ వ్యాఖ్యలు చేస్తేనే.. అదే పనిగా ట్వీట్లు చేసే వర్మ.. యామిని సైకో విమర్శ నేపథ్యంలో ట్వీట్ల వర్షం ఖాయమంటున్నారు. మరి యామిని సాధినేని వ్యాఖ్యలకు వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.