టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం మహర్షి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(బుధవారం) హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో మహేశ్ అభిమానులు ఈ ఫంక్షన్కు హాజరై తెగ హంగామా చేశారు. అయితే మహేశ్ మాట్లాడే సమయంలో తన గత సినిమాలను గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. తన మొదటి సినిమా రాజకుమారుడు, మురారి, ఒక్కడు , అతడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలను గుర్తు చేసుకుని ఆ దర్శకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే ఈ సమయంలో మహేశ్ బాబు పెద్ద తప్పిదమే చేశాడు. తన కెరీర్లో బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చిన పోకిరి సినిమాను మర్చిపోయాడు మహేశ్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. 2006లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతోనే మహేశ్ బాబు స్టార్ హీరోతో పాటు సూపర్ స్టార్ కూడా ఎదిగాడు. మరి అలాంటి సినిమాను మహేశ్ బాబు ఎలా మర్చిపోయ్యాడో ఎవ్వరికి అర్థం కావడం లేదు. బిజినెస్ మ్యాన్ సినిమాతో మహేశ్కు మరో హిట్ ఇచ్చాడు పూరి. అయితే గత కొంతకాలంగా మహేశ్తో జనగణమణ అనే సినిమా చేయలని ఆశతో ఉన్నాడు పూరి. కాని పూరి ట్రాక్ ప్రస్తుతం ఏమాంత బాలేదని అతనికి ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు మహేశ్.
అయితే ఈ సినిమా మహేశ్ ఒప్పుకోకపోతే వేరే హీరోతో తీస్తానని అప్పట్లో మీడియా ఎదుట చెప్పాడు పూరి. ఈ సినిమా విషయంలో ఇద్దరి మధ్య కాస్తా గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేశ్ ,పూరి పేరును ప్రస్తావించలేదని ఇండస్ట్రీలో కొందరు చర్చించుకుంటున్నారు. అయితే మహేశ్ది అలాంటి వ్యక్తిత్వం కాదని, ఇలాంటివి మనుస్సులో పెట్టుకుని కక్ష్య సాధించాలని కోరుకునే మనిషి మహేశ్ కాదని, మర్చిపోయి ఉంటాడని మరికొందరి వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మహేశ్ తాను చేసిన తప్పు గురించి ట్విట్టర్లో స్పందించాడు. సారీ నా కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పోకిరి సినిమా గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాతోనే నేను సూపర్స్టార్ అయ్యానని, థ్యాక్యూ పూరి జగన్ అంటూ ట్విట్టర్లో చేసిన తప్పును సరి చేశాడు.
- Advertisement -
ఆ విషయంలో లెక్క సరిచేసిన మహేశ్ బాబు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -