నాలుగేళ్ల క్రితం సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్లో కాలుపెట్టిన రకుల్ ప్రీత్ కు అక్కడ చేదు అనుభవమే ఎదురయ్యింది. అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆతర్వాత ఐయారీ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ రాత మారలేదు. మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యింది.
స్తుతం దే దే ప్యార్ దే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ తన భావాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారమన్నారు. జయాపజయాలు మన చేతిలో ఉండవు. విజయాలను అందుకోవడానికి జర్నీలో ఎదురయ్యే ప్రతికూలతను ఎదిరించడం నేర్చుకోవాలి అని రకుల్ ప్రీత్ అన్నారు.
కష్టపడి పనిచేయడాన్ని తాను ఆస్వాదిస్తానన్నారు. వర్క్ను నేను ఎంతగా ఇష్టపడుతానంటే.. 30 గంటలపాటు అలుపుసొలుపు లేకుండా ఏకధాటిగా పనిచేప్పుకొచ్చారు.నాలో ప్రతిభను గుర్తించే వారి కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను అని రకుల్ అన్నారు. ఈ సినిమాతో నైనా బాలీవుడ్లో రకుల్ దశ తిరుగుతాదేమో చూడాలి.