ప్రపంచ కప్ ముంగిట ఈ వార్త టీమిండియాకు షాకింగ్ అనే చెప్పాలి. రేపు సౌతాఫ్రికాతో ఆడాల్సిన మొదటి మ్యాచ్కు సన్నద్ధమవుతున్న తరుణంలో జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఊహించని పిలుపు వచ్చింది. డోపింగ్ టెస్ట్కు శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కోరింది. డోప్ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇవ్వాలని కోరడంంతో ఆ పరీక్షలకి తాజాగా బుమ్రా హాజరయ్యాడు.
ఐసీసీ టోర్నీ సమయాల్లో వాడా.. ఆటగాళ్లకి డోపింగ్ టెస్టుల్ని నిర్వహించడం సర్వసాధారణం. జట్టులో అందరికి కాకుండా తమకు కావాల్సిన వాళ్లను ఎన్నుకొని డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎవరైనా డోపింగ్ టెస్ట్కు శాంపిల్స్ ఇవ్వుకుండా తప్పించుకుంటె….వారిపై నిషేధం విధించనుంది వాడా. డోప్ టెస్టు ఫలితాలు ఆలస్యంగా వెలువడనున్నాయి. దక్షిణాఫ్రికాతో బుధవారం మధ్యాహ్నం భారత్ జట్టు తన తొలి మ్యాచ్లో తలపడనుంది. టోర్నీలో ఇంగ్లాండ్, పాకిస్థాన్తో పాటు దక్షిణాఫ్రికా కూడా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడేసిన విషయం తెలిసిందే