- Advertisement -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుంలా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.