Sunday, May 26, 2024
- Advertisement -

పవన్ తో వంగవీటి రాధ చర్చలు …టీడీపీకి గుడ్ బై….?

- Advertisement -

చంద్రబాబను వలసలు భయపెడతున్నాయి. ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీ నుంచి బయలకు వెల్తున్న నాయకులను ఆపలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాబుకు ఇప్పుడు మరో కోలుకోలేని దెబ్బ పడనుంది.టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.

అధినే పవన్‌తో చర్చలు జరుపుతున్నారా.. పరిస్థితులు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌‌‌‌‌కు వెళ్లారు. అక్కడ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపారు.దిండి రిసార్ట్స్‌లో పవన్ కళ్యాణ్‌తోనూ వంగవీటి భేటీకానున్నారు

ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు రాధ. కాని ఆయనకు బాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు.సీటు రాకపోయినా దక్కకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని భావించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా మారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు.వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ సందిగ్థంలో పడింది. దాంతో సైలెంట్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం పవన్ ను కలిసినపుడు జనసేనలో చేరుతున్నారనె వార్తలు గుప్పుమన్నాయి.తాజాగా మరోసారి పవన్‌ను కలుస్తుండటంతో జనసేనలోకి వెళతారనే చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -