Tuesday, April 30, 2024
- Advertisement -

సై రా లొకేషన్ పర్మిషన్ కోసం, వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు: చిరంజీవి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ పరుల అభివృద్ధి ని కాంక్షిస్తూ ఉంటారు. ఇదే ఇషయం మరొకసారి రుజువయింది. ఆయన మేనేజర్లు నిర్వహించిన ఒక ఈవెంట్ లో పాల్గొని మేనేజర్ల గొప్పతనం చెప్తూ, వారు సినిమా కి అందించే కృషి గురించి మాట్లాడుతూ వాళ్లకు బాగుండాలి అని కోరారు.

“అందరికి నమస్కారం. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రధతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది.ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూసాను. సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుంది. సైరా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ ను విజయవంతం చెయ్యడానికి అందరూ స్వచ్చందంగా వచ్చాము.” అని చిరంజీవి తన స్పీచ్ లో తెలిపారు.

చిరంజీవి ఈ ఈవెంట్ కి రావడం అందరినీ ఎంతగానో సంతోషపరిచింది అని చెప్పొచ్చు.ఇకపోతే త్వరలో నే మనం చిరంజీవి ని సై రా నరసింహ రెడ్డి అనే సినిమా లో చూడనున్నాము.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -