- Advertisement -
అందరూ అనుకున్నట్లుగానె తూర్పుగోదావరి జిల్లాలో బాబుకు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు టీడీపీ పార్టీకి రాజానామా చేశారు. ఈనెల 18న ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో ఆయన చేరనున్నారు. ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాల పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన అనంతరం పార్టీకి రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన అనంతరం వ్యాఖ్యానించారు.కార్యకర్తల సహకారం మరిచిపోలేనిదన్న తోట త్రిమూర్తులు.. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను ప్రజల మనసును గెలుచుకున్నానని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కేలీక నేతలంతా పార్టీని వీడుతున్నారు.