కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు ఈ హీరోయిన్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది. వరస విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ.. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి వరకు వెళ్లింది. అయితే ఇప్పుడు ఇందుకు బిన్నంగా కాజల్ పరిస్థితి మారింది. ఒకవైపు హిట్ లు లేవు.. మరోవైపు అవకాశాలు లేవు.
ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ లో కంగనా కథానాయికగా వచ్చిన క్వీన్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాని తమిళంలో కూడా రీమేక్ చేయారు. ఈ తమిళ రీమేక్ కు ’ప్యారిస్ ప్యారిస్’ అనే టైటిల్ పెట్టగా.. కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు.
కాజల్ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ అవ్వడంతో పాటు 25 వరకూ ఆడియో, వీడియో కట్స్ను ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీడియాకు వెల్లడించారు. కమిటీ ఈ సినిమాను చూసిన తర్వాత కూడా తమ నిర్ణయంలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో ఈ సినిమా వివాదం అలాగే ఉండిపోయింది. ‘ప్యారిస్ ఫ్యారిస్’లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని టీజర్ చూస్తేనే అందరికీ అర్థం అయింది.
అంతేకాదు, టీజర్లో కాజల్ బ్రెస్ట్ని మరో నటి ప్రెస్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇందులో అలాంటి సీన్స్ ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు కట్స్ రావడంతో ఇది నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఈ సినిమా విడుదలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర వివాదం గురించి కాజల్ ను ప్రశ్నించగా.. సెన్సార్ సమస్యలు వచ్చాయి.
ఇందులో బోల్డ్ సీన్స్ అసలు లేవు. క్వీన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా వివాదంతో కాజల్ అసంతృప్తిగా ఉందట. ఇకపై బోల్డ్ క్యారెక్టర్లు చేయకూడదని ఆమె నిర్ణయించుకుందని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తున్నారని బోల్డ్ గా నటిస్తే సినిమా కూడా రిలీజ్ కావడం లేదని ఫీల్ అవుతోంది.