ప్రపంచ సుందరిగా కిరీటం భారత్కు తీసుకొచ్చి ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్గా రాణించిన ఐశ్వర్యరాయ్ పెళ్లయిన తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంది. ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించేసి ఇంటికి పరిమితమైంది. బాలీవుడ్లో స్టార్ హోదా దక్కించుకున్న హీరోయిన్ అభిషేక్ బచ్చన్ను పెళ్లాడి కొన్నాళ్లు ఇంటికి పరిమితమై తర్వాత సినిమాలు చేస్తోంది.
అయితే ఇటీవల ఓ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో వ్యక్తిగతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లయిన రెండేళ్లకు ఐష్కు కుమార్తె ఆరాధ్య పుట్టింది. ఇప్పుడు ఆరాధ్య పాఠశాలకు కూడా వెళ్తోంది. అయితే ఐశ్వర్య కూడా అందరూ తల్లులలాగే పాప పాఠశాలకు రోజూ వెళ్లి వస్తానని ఐశ్వర్యరాయ్ చెప్పింది. అందరు తల్లులలాగే తను వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్లు చెప్పారు.
ఆరాధ్యతో అందరిలాగే సాధారణ తల్లిగా ఉంటా. ఆమె పాఠశాలకు ప్రతి రోజు వెళ్తా. పాపతో కలిసి పార్కుకు, మార్కెట్కు వెళ్లడం వంటి సాధారణ పనులు చేస్తుంటా. అప్పుడే ఆరాధ్యకు సహజమైనది ఏంటి? సోషల్ ఎగ్జైట్మెంట్ అంటే ఏంటి? అనే విషయాలు తెలుస్తాయి’ అని ఐశ్వర్య వెల్లడించింది.‘ఆరాధ్య చిన్న పాప.. తనకు అది (మీడియాతో మెలిగే తీరు) అర్థం అవుతుందని నేను చెప్పడం సరికాదు. ఆమె పసిపాపగా ఉన్నప్పటి నుంచి ఇది (మీడియాను) చూస్తోంది. నేను నా 20 ఏళ్ల వయసులో దీన్ని ఎదుర్కొన్నా. ఇది ఆమెకు సర్వ సాధారణం అయిపోయిందేమో? నాకు తెలియదు..’.రాజ్కుమార్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలతో పాటు ప్రస్తుతం ఐష్ నటిస్తున్న సినిమా ‘ఫ్యాన్నీ ఖాన్’. ఈ సినిమాను రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా నిర్మిస్తున్నారు. ‘ఎవ్రీబడీస్ ఫేమస్’ సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.