బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్లో ఝాన్సీ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది ఝాన్సీ. అయితే ఆమె మరణానికి కారణం ఇష్టంలేని పెళ్లి అని తెలుస్తోంది. ఝాన్సీ ఓ వ్యక్తిని ప్రేమించిందని సమాచారం. కాని ఇంట్లో ప్రేమ వివాహానికి నిరాకరించడంతోనే, ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో వేరే పెళ్లి చూడటంతోనే ఆమె ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఝాన్సీ తన ఇంట్లో ఫ్యానుకు ఊరి వేసుకుని చనిపోయింది. అయితే ఆమె ఆత్మహత్యపై ఇంకా దర్యాప్తు కొనసాగుతునే ఉంది. ఆమె మరణించి మూడు రోజలు కావస్తున్న ఇప్పటికి వరకు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సూర్య తేజ అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఝాన్సీ సూర్య తేజకు పంపించిన మేసేజ్లను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఝాన్సీ రెండు ఫోన్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.
మెసేజ్లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఐఫోన్ లాక్ తెరిస్తే ఎన్నో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ఝాన్సీ ఇలాగే ఒసారి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
- Advertisement -
నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు..గుట్టు అంత ఆ ఫోనులోనే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -