Sunday, May 12, 2024
- Advertisement -

విక్రమ్ ముందు నటించను అని చెప్పేసిన ధృవ్ విక్రమ్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఇప్పుడు ‘ఆదిత్య వర్మ’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇక ఈ సినిమాని మరొక మరి కొన్ని వారాల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ తో ధృవ్ విక్రమ్ తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విక్రమ్ ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ ను అందరితో పంచుకున్నారు. ఒకసారి విక్రమ్ ‘ఆదిత్య వర్మ’ షూటింగ్ సెట్స్ కి మరియు డబ్బింగ్ స్టూడియో కి వెళ్ళారట. అయితే తన తండ్రి ముందు నటించడానికి మరియు డబ్బింగ్ చెప్పడానికి సిగ్గు పడి ధృవ్ చేయనని చెప్పేశారట. అయితే విక్రమ్ స్వయంగా వెళ్లి పని పైన మాత్రమే దృష్టి పెట్టమని తనని ఒక తండ్రిగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా చూడమని చెప్పారట. విక్రమ్ మాటలు విన్నాక వాటిని సీరియస్గా తీసుకొని ఆ తర్వాత మళ్లీ మామూలుగా నటించాడట. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ ఇప్పుడు తమిళంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -