Friday, May 10, 2024
- Advertisement -

సంక్రాంతి సై అంటున్న హీరోలు

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో నంద‌మూరి బాల‌కృష్ణ ఢీకొట్ట‌నున్నాడు. గ‌త సంక్రాంతికి చిరంజీవితో త‌ల‌ప‌డిన బాల‌కృష్ణ ఇప్పుడు ప‌వ‌న్‌తో పోటీ పెట్టుకుంటున్నాడు. సంక్రాంతి క‌య్యానికి కాలు దువుతున్నాడు. ‌‌’అజ్ఞాతవాసి’గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ‘జైసింహా‌‌‌’ గా బాల‌య్య సంక్రాంతి సినిమా పండుగ‌కు రానున్నారు. గ‌త సంక్రాంతికి చిరంజీవి ఖైదీ 150తో బాల‌య్య ఇప్పుడు మ‌ళ్లీ సిద్ధ‌మ‌య్యాడు. సంక్రాంతి బ‌రిలోకి దిగడం బాల‌య్య‌కు అల‌వాటే. ఆ స‌మ‌యంలో ఇరు హీరోల అభిమానుల మ‌ధ్య తీవ్ర పోటీ ఏర్ప‌డి భ‌యోత్పాతం ఏర్ప‌డుతుంది. పోటాపోటీగా విడుద‌ల అవ‌డంతో ప్ర‌జ‌ల్లో కూడా ఇదే హాట్ టాపిక్‌గా నిలిచేది. బాలకృష్ణ సినిమాతో పోటీ పడితే బిజినెస్‌ పరంగా భయం ఉండదు. కానీ, బాలయ్య చిత్రాలతో పోటీప‌డితే థియేటర్ల కొరత మాత్రం వేధిస్తుంటుంది. సీడెడ్‌, గుంటూరు లాంటి ఏరియాల్లో బాలయ్య సినిమా ఉంటే బీ, సీ కేంద్రాల్లో థియేటర్లన్నీ ముందే బుక్ అవుతుంది. సింగిల్‌ థియేటర్‌ లేదా డబుల్‌ థియేటర్ ఉన్న ఊళ్లల్లో బాల‌య్య సినిమానే ఆ థియేటర్లలో ఆడుతుంది.

దీంతో పోటీగా వచ్చిన సినిమాలకి ఆయా ఊళ్లలో థియేటర్లు దొరకవు. మొదటి వారంలో వసూళ్లు సాధించడమే ఇప్పుడు ఏ సినిమాకి అయినా కీలకం. దీంతో అలాంటి సింగిల్‌ థియేటర్ ఉన్న ఊళ్లల్లో రిలీజ్‌ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈసారి ఆ తలనొప్పి పవన్‌కళ్యాణ్‌ సినిమాకి ఎదురు కానుంది. త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ‘అజ్ఞాతవాసి‌ ‘గా జనవరి 10వ తేదీన విడుద‌ల కానుంది. రెండు రోజుల త‌ర్వాత 12న జైసింహా వస్తోంది. దీని వల్ల కేవలం రెండు రోజులు మాత్రమే పవన్‌ సినిమాకి కొన్ని థియేటర్లు దొరుకుతాయి. బాల‌య్య సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా పోటీకి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -