Sunday, May 19, 2024
- Advertisement -

రోబో 2.0 పైర‌సీ….!

- Advertisement -

తమిళరాకర్స్ ఇప్పుడు ఎక్క‌డ చూసిన వీరి గురించే చ‌ర్చ‌.ఎందుకంటే సినిమా విడుద‌ల రోజునే హెచ్‌డి ప్రింట్‌ని ఆన్‌లైన్‌లో పెట్టి నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నారు. మ‌హేశ్ బాబు న‌టించిన స్పైడ‌ర్ ,విజ‌య్ తాజాగా న‌టించిన స‌ర్కార్ మూవీల హెచ్‌డి ప్రింట్‌ని ఆన్‌లైన్‌లో పెట్టి సంచ‌ల‌నం సృష్టించారు తమిళరాకర్స్.ఇప్పుడు వీళ్లు మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా ‘2.0’ మేకర్స్ కి సవాల్ విసురుతోంది. తమిళ రాకర్స్ సైట్ లో త్వరలోనే ‘2.0’ రాబోతుంది అంటూ ఈ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకులు ట్వీట్ చేశారు.

రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను ఇప్పుడు పైరసీ చేస్తామని ముందే వార్నింగ్ ఇవ్వడం చిత్రబృందంలో ఆందోళన మొదలైంది. తమిళరాకర్స్ చెప్పిందే గనుక చేస్తే ఈ సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా.. అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2.0 సినిమా క‌నుక పైర‌సీ అయితే నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -