టాలీవుడ్లో సంచలన విజయం అందుకున్న భీమ్లానాయక్.. బాలీవుడ్నూ షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పటికే భారీ కలెక్షన్లు రాబడుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
భీమ్లా నాయక్ మూవీని హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్యనే హిందీ వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ను కూడా వదిలారు. దీనిలో పవన్ కళ్యాణ్ వాయిస్కు హిందీలో డబ్బింగ్ చెప్పింది ఎవరూ అని అభిమానులు ఆరా తీస్తున్నారు. పవన్కు వాయిస్ ఇచ్చినది ప్రముఖ టీవీ ఆర్టిస్టు గౌరవ్ చోప్రా అని తెలుస్తోంది. అక్కడ ఈయన వాయిస్ చాలా ఫేమస్.
అందుకే పవన్కు పర్ఫెక్ట్గా సూటవుతుందని ఆయనతో భీమ్లా నాయక్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారట. టాలీవుడ్లో ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో .. ? అక్కడ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
మహేశ్కు విలన్గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్