జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనుసూయ … ఆ పాపులారిటితో స్టార్డమ్ సంపాదించుకుంది. ఓ వైపు యాంకర్గా రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిగా దూసుకుపోతోంది. పుష్ప సినిమాలో అనుసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి అనుసూయ సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.
అడవి శేష్ హీరోగా వచ్చిన ‘క్షణం’ సినిమాతో పరిచయమైన అనుసూయ.. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన కెరీర్నే మలుపు తిప్పింది. తాజాగా పుష్పలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్లో అలరించింది. ప్రస్తుతం అనసూయ..ఓ మలయాళ చిత్రంలో నటించబోతోంది. స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న ‘భీష్మ పర్వం’లో అనసూయ.. ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
ఇక తమిళంలో కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల అనసూయ కాస్త సన్నబడినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇదంతా తన బాలీవుడ్ ఎంట్రీ కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో అనసూయ బాలీవుడ్కూ పరిచయం అయ్యింది. మొత్తమ్మీద అనుసూయ బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.