సుకేశ్ చంద్ర శేఖర్ మనీలాండరింగ్ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 200కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో.. ఈడీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. జాక్వలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలతో పాటు… సుకేశ్ మరికొందరు బాలీవుడ్ భామలను ఉచ్చులో వేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సుకేశ్ టార్గెట్ చేసిన వారిలో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, భూమీ ఫెడ్నేకర్ వంటి తారలున్నారు. గత కొద్ది నెలలుగా సుకేశ్, అతని భార్య లీనా మారియా పాల్లను ఈడీ విచారిస్తోంది.
సుకేశ్ ఇప్పటికే జాక్వలిన్కు పలు విలువైన బహుమతులు అందజేసినట్లు ఈడీ గుర్తించింది. వీటిలో పర్షియన్ పిల్లులు, గుర్రం ఉన్నాయి. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి మోసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. సుకేశ్ టార్గెట్ చేసిన బాలీవుడ్ భామల్లో సైఫ్ ఆలీ ఖాన్, అమృతా సింగ్ల కుమార్తె సారా ఆలీ ఖాన్ కూడా ఉంది. మే 2021లో సారా అలీఖాన్ను సూరజ్ రెడ్డి అనే పేరుతో వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. విలువైన కారు బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు సారాకు వల వేశాడు. తన కంపెనీ సీఈఓ పింకీ ఇరానీ సైతం ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు వివరించాడు.
సుకేశ్తో కలిసేందుకు హీరోయిన్లను ఒప్పించటమే పింకీ ఇరానీ పని. జాక్యులిన్కు సుకేశ్ను పరిచయం చేసింది కూడా పింకీనే. సారాకు పలు మార్లు బహుమతులు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు సుకేశ్. అయితే.. అతని బహుమతులను నిరాకరించినట్లు తెలుపుతూ జనవరి 14న సారా ఈడీకి లేఖ రాసింది. సుకేశ్ అనేక సార్లు ఒత్తిడి చేయగా.. చివరికి ఓ చాక్లెట్ల బాక్స్ తీసుకునేందుకు అంగీకరించింది సారా. దీంతో చాక్లెట్లతో పాటు ఆమెకు… లక్షల విలువ చేసే ఫ్రాంక్ ముల్లర్ వాచ్ను బహుకరించాడు.
సుకేశ్ టార్గెట్ చేసిన మరో బాలీవుడ్ భామ ఝాన్వీ కపూర్. శ్రీదేవి, బోనీ కపూర్ల కుమార్తె జాన్వీని తన జీవిత భాగస్వామి… లీనా మారియా పాల్ ద్వారా సంప్రదించాడు సుకేశ్. లీనా తానో సెలూన్ యజమానినని, నెయిల్ ఆర్టిస్ట్నని జాన్వీని పరిచయం చేసుకుంది. సెలూన్ ఓపెనింగ్కు రావాలని జులై 19, 2021న జాన్వీని బెంగుళూరుకు ఆహ్వానించింది. విషయం తెలియని జాన్వీ… సెలూన్ ఓపెనింగ్కు హాజరై 18.94లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంది. దీనితో పాటు లీలా తల్లి తనకు క్రిస్టియన్ డయోర్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చినట్లు ఈడీకి తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ కు సూపర్ స్టార్ సాయం..