- Advertisement -
ఒకప్పటి హీరోయిన్ రంభ తన జీవితంలో మూడో బిడ్డకు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది.ఇప్పటికే ఇద్దరి ఆడపిల్లలకి తల్లైనా రంభ ఇప్పుడు మరో బిడ్డకు జన్మనిస్తుంది.2010లో రంభ వివాహం చేసుకుంది. అయితే భర్తతో చిన్నపాటి వివాదంతో ఈమె కోర్టు మెట్లు ఎక్కింది.
విడాకులు తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చినా, భర్తతో వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకుంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరు మరో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ సినిమాలో ప్రత్యేకమైన రోల్ చేస్తుందని వార్తలు వచ్చాయి.ఇవి అన్ని రూమర్సే అని తెలిపింది రంభ.