Thursday, May 16, 2024
- Advertisement -

దుర్మార్గులారా.. సోనూసూద్‌ని కూడా వదల్లేదు..

- Advertisement -

ఈ మద్య ఈజీ మనికి అలవాటు పడ్డవారు చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎదుటి వారి బలహీనతలే ఇలాంటి కేటుగాళ్లకు పెట్టుబడి. ఈ మద్య సైబర్ నేరగాళ్ల దోపిడీ మరీ ఎక్కువైపోతుంది. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు నేనున్నా అంటూ ముందుకు వచ్చిన అభినవ కర్ణుడు సోనూ సూద్ ని కూడా వదల్లేదు కేటుగాళ్లు. ఆయన పేరుతో డబ్బు వసూళ్లకు దిగారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూదే తెలియజేశాడు.

కరోనా కష్టకాలంలో.. ఎంతో మందికి సాయం చేసేందుకు సూద్ ఫౌండేషన్ ను సోనూ ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలే గాక సారా అలీ ఖాన్ లాంటి స్టార్లు కూడా ఈ ఫౌండేషన్ కు విరాళాలు ఇస్తున్నారు. అయితే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట పలు నకిలీ లింకులు వెబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ తమ నంబర్లు ఇచ్చి విరాళాలను కొట్టేయాలని కేటుగాళ్లు ప్లాన్ వేశారు.

ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే తేరుకున్నారు. దీనిపై సోనూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘వార్నింగ్‌’.. ఫేక్‌ ఫౌండేషన్‌ అంటూ ఒక పోస్టును ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. లాంటి నకిలీ ట్వీట్లు, వెబ్ లింకులు, ఫోన్ నంబర్లను నమ్మొద్దని.. ఇవి ఫేక్ అని పేర్కొన్నాడు. నకిలీరాయుళ్లను హెచ్చరిస్తూ వార్నింగ్ అనే క్యాప్షన్ ను ట్వీట్ కు జత చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -