సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు, మోడల్ శ్రీవాత్సవ్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యువ నటుడు, మోడల్ శ్రీవాస్తవ్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న అతడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డిప్రెషన్తో బాధపడుతున్న గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, షూటింగ్ ఉందని చెప్పి పెరంబూర్లోని ఇంటి నుంచి, తన తండ్రి ఆఫీస్ హౌజ్కు చేరుకున్న శ్రీవాస్తవ్ అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి ట్యాలెంట్ ఉన్న శ్రీవాత్సవ్ ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు టెలివిజన్ నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్టా’ సినిమాలో హీరో ధనుష్తో శ్రీవాస్తవ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అదే విధంగా .. ‘వల్లామై తరాయో’ అనే వెబ్సిరీస్లో సైతం నటించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓ చినదాన అనే టైటిల్తో ఓ తెలుగు చానెల్లో ప్రసారం అవుతోంది.