అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. వరుడు మూవీ లో వధువు ఎవరంటూ చాలా హైప్ ని క్రియేట్ చేయడంతో ఆమె అప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కానీ ఈ సినిమా విడుదలై ఫ్లాప్ అవడంతో ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. వరుడు సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆమె కెరీర్ కు అవి కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె తనుష్ హీరోగా వస్తున్న మహాప్రస్తానం సినిమాలో నటిస్తోంది. అయితే భాను రీసెంట్ గా వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. నవంబర్ 1న కరన్ తో భాను వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
వీరిది ప్రేమ పెళ్లి. వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. వీరి వివాహం పంజాబ్ సాంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది భాను.