సినీ నటి హేమ వెబ్ సైట్ నిర్వాహకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం వెబ్ సైట్ నిర్వాహకులు అనవసరమైన బూతులు రాస్తున్నారని నటి హేమ కోపడింది.
కేవలం సినిమా వారి మీదే కాకుండా.. సామాన్యులపై కూడా ఇలాంటి రాతలు రాస్తున్నారని.. అలాగే ఫేస్ బుక్ లోనూ మార్ఫింగ్ చేసి.. ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని హేమ ఆవేదన చెందింది. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్స్ లో చెర్చ్ చేస్తే.. దాని పక్కన ఇది క్లిక్ చేయండంటూ అశ్లీల వీడియోలు, రాతలు ఉంటున్నాయని హేమ తెలిపారు. అలానే సినిమా వారిపై వస్తున్న రూమర్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్టడం వల్ల అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది.
సినీ రంగంకు చెందినవారు మాత్రమే కాదు.. అన్ని వర్గాల మహిళలపై కూడా వెబ్ సైట్ నిర్వాహకులు ఈ పని చేస్తున్నారని ఆమె చెప్పింది. వెబ్ సైట్ నిర్వాహకులకు కొవ్వెక్కి.. ఇలాంటి రాతలు రాస్తున్నారని.. అనవసరపు వార్తలను వెబ్ సైట్లో పోస్ట్ చేస్తున్నారని ఆమె తెలిపింది.