Friday, April 26, 2024
- Advertisement -

టాలీవుడ్ సెలబ్రెటీలకు పూజా హెగ్డే ప్రత్యేక కానుకలు.. ఎంటో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి ముకుంద, ఒక లైలా కోసం చిత్రాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో ఈ బ్యూటీ హాట్ హాట్ గా కనిపించింది.. అంతే ఆ తర్వాత ఆఫర్లు వరుసగా వచ్చాయి. టాప్ హీరోలతో ఛాన్స్ దక్కడంతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న పూజా హెగ్డే ‘ఆచార్య’లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది.

ఈ మద్య పూజా హెగ్డే కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు కరోనాని జయించింది.. ఈ విషయం సంతోషంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు స్నేహితుల‌కు కొన్ని గిఫ్ట్స్ పంపిస్తుంద‌ట‌. మంగ‌ళూరులో మామిడి తోట ఉండ‌గా, అక్క‌డ పండిన ప‌ళ్ల‌ను బాక్స్‌లో ప్యాక్స్ చేయించి గిఫ్ట్‌లుగా పంపిస్తుంద‌ట‌.

పూజా హెగ్డే నుండి అందుకున్న గిఫ్ట్స్‌ని చూసి వారు తెగ సంతోష‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా తన ఆత్మీయులకు తన తోటలో పండిన మామిడి ప‌ళ్ల‌ను గిఫ్ట్‌గా పంపుతున్న విష‌యం తెలిసిందే.

కరోనా వైరస్ గాలిలో 6 అడుగుల వరకు వ్యాప్తి.. జర జాగ్రత్త!

తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -