Saturday, April 27, 2024
- Advertisement -

త‌న ఫోటోలు పోస్ట్ చేశాడ‌ని భ‌ర్తకు విడాకులిచ్చిన న‌టి

- Advertisement -

త‌న వ్య‌క్తిగ‌త ఫోట‌ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడ‌ని ఏకంగా త‌న భార్త‌కు విడాకులు ఇచ్చాన‌ని చెబుతోంది ఓ న‌టి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… మ‌ళ‌యాళ న‌టి ప్రియాంక ప‌లు సినిమాల‌లో న‌టించి పేరు తెచ్చుకుంది. చూడ‌చ‌క్క‌ని అందం ఆమె సొంతం. 2012లో ద‌ర్శ‌కుడిని లారెన్స్ రావ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక‌. పెళ్లైన కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది. వీరికి ముకుందరామ్ అనే కొడుకు కూడా పుట్టాడు. ఆ త‌రువాత వీరి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింది ప్రియాంక‌.

అయితే ఆ స‌మ‌యంలో ప్రియాంక త‌న భ‌ర్త‌కు ఎందుకు విడాకులు ఇచ్చిందో కార‌ణం చెప్ప‌లేదు.తాజాగా ప్రియాంక ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు త‌న భ‌ర్త‌కు ఎందుకు విడాకులు ఇవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.త‌న అంత‌రంగిక ఫోటోల‌ను త‌న భ‌ర్త లారెన్స్ రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, అందుకే ఆయనతో కాపురం చేయడం ఇష్టం లేక విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.అదే స‌మ‌యంలో నేను న‌టించ‌డ అత‌నికి ఇష్టం లేద‌ని , అందుకే అత‌నితో క‌లిసి జీవించ‌డం ఇష్టం లేకే విడాకులు ఇచ్చాన‌ని చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న త‌రువాత ప‌లు సినిమాల‌లో న‌టించింది ప్రియాంక‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -