Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్ ని టార్చర్ చేసిన లెక్చరర్.. ఆ గుట్టు అంతా అలా?

- Advertisement -

ప్రస్తుత ఈ కాలంలో సోషల్ మీడియా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకు తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ సమయంలోనే సెలబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ చేదు సంఘటన తమిళ హీరోయిన్ సౌందర్య నందన్ కుమార్ విషయంలో జరిగింది. హీరోయిన్ సౌందర్య ఈ సంఘటనను తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా సౌందర్య నందన్ కుమార్ పట్ల ఓ లెక్చరర్ ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తను ఒక లెక్చరర్ అని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి తనతో ఎంతో మాట్లాడారని పేర్కొంది. నాతో పడుకుంటావా? జస్ట్ నాతో పడుకుంటే చాలు నీకేం కావాలన్నా ఇస్తా అంటూ లెక్చరర్ చేసిన మెసేజ్ లను చూసి సౌందర్యకు దిమ్మతిరిగిపోయినట్లు, ఆ సమయంలో అతనిని ఏమనాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు.

Also read:సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

ఈ క్రమంలోనే సౌందర్య నందన్ అతను పెట్టిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసుకుని పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరించారు.అదేవిధంగా తను పనిచేసిన కాలేజీ యాజమాన్యానికి కూడా ఈ విషయం తెలియజేస్తానని, ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి పనులు చేసే వారిని అస్సలు వదిలిపెట్టనని అతడిని గట్టిగా మందలించడంతో అతను తనని బ్లాక్ చేశాడని ఆమె తెలిపింది. ఇకపోతే ఈమె తాజాగా దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రంలో నటించారు.

Also read:మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫాలోవర్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -