టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే.
కొంత కాలం పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ తిరిగి “ఖైదీ నెంబర్ 150″ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మెగా స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన” సైరా నరసింహారెడ్డి “మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా “ఆచార్య” కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
గతేడాది మెగా స్టార్ చిరంజీవి అభిమానులకు మరింత దగ్గరవడానికి ఉగాది పండగ సందర్బంగా మార్చి 25న ట్విటర్ ఖాతాను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో చిరంజీవి తన సినిమా విషయాలతో పాటు మిగతా ప్రామాణిక విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటారు.అనతి కాలంలోనే ఆయన ట్విటర్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య పది లక్షలకు చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన దూకుడు ప్రదర్శిస్తున్నాడని చెప్పవచ్చు.
Also read:మోనాల్ అంటే అఖిల్ కు అంతా ప్రేమా? వామ్మో!
ఇటీవలే “ఆచార్య “మూవీలో ‘లాహే..లాహే… అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ యూట్యాబ్లో 35 మిలియన్ల వ్యూస్ని సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. చిరంజీవి తదుపరి సినిమా “లూసిఫర్” రీమేక్ చిత్రంలో నటించాలని ప్లాన్ చేస్తున్నారు .ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణిదేల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Alspo read:త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?