Thursday, May 2, 2024
- Advertisement -

రామ్ చరణ్ రంగం లో కి దిగాల్సిందే..

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకం గా భావించి చేస్తున్న చిత్రం సై రా నరసింహా రెడ్డి. ఈ సినిమా ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తూ ఉండగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బానర్ మీద నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కించబడుతుంది. ఈ సినిమా మొదలు అయ్యి ఇప్పటికే చాలా సమయం అవుతుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ సినిమా అక్టోబర్ లో విడుదల అవుతుంది అని వార్తలు వచ్చినా ఇప్పుడు ఈ సినిమా ఈ ఏడాది వచ్చేది లేదు అని పుకార్లు మళ్ళి షికారు చేస్తున్నాయి.

అయితే ఈ సారి సినిమా వాయిదా పడడానికి కారణం గా వీ ఎఫ్ ఎక్స్ టీమ్ ని చూపిస్తున్నారు కొంత మంది. సినిమా లో యుద్దాలు కి సంబందించిన సీన్లు చాలా ఉన్నాయి అని, వాటిని జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా కంప్లీట్ చేయాలంటే సమయం పడుతుంది అని, ఈ ఏడాది చివరి వరకు సమయం కావలి అని అడిగారని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే ఇప్పటికైనా రామ్ చరణ్ మౌనం వీడి చిరంజీవి రాక పై క్లారిటీ ఇవ్వాలని మీడియా ఆశిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -