Sunday, May 12, 2024
- Advertisement -

మిస్‌ ఇండియాకి పెళ్లి అయి అప్పుడే పుష్కరకాలం అయిందా..!

- Advertisement -

మాజీ మిస్‌ ఇండియా ఐశ్వర్య రాయ్, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిషేక్ బచ్చన్‌ల పెళ్లి అయి అప్పుడే పుష్కరకాలం పూర్తి అయింది. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఐష్‌ అభిషేక్ బచ్చన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2007లో వీరిద్దరు ఒకటైయ్యారు. పెళ్లికి ముందు అభిషేక్ బచ్చన్‌ కంటే ఐష్‌కే ఎక్కువ క్రేజ్‌ ఉంది. వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్లుగా నిలిచాయి. అభిషేక్ బచ్చన్‌ కంటే ముందే ఇద‍్దరి హీరోలతో ప్రేమయాణం సాగించింది ఐశ్వర్య రాయ్. కెరీర్‌ స్టార్టింగ్‌లో సల్మాన్ ఖాన్‌తో కొంతకాలం ఎఫైర్‌ సాగించింది ఐష్‌.

తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో సల్మాన్‌ నుంచి విడిపోయింది. తరువాత కొంతకాలనికి వివేక్ ఒబెరాయ్‌తో తో కొంత కాలం ఆమె ప్రేమలో గడిపింది. చివరకు అభిషేక్ ను వివాహం చేసుకున్నారామె. అభిషేక్‌కు కొన్ని ఎఫైర్స్‌ ఉన్నాయి. హీరోయిన్‌ కరిష్మా కపూర్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లాడు అభిషేక్‌. కారణం తెలియదు కాని వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ‍్లలేదు. పెళ్లి తరువాత అభిషేక్‌కి సరైన హిట్లు లేవు. అడపాదడపా సినిమాలు చేస్తూ సాగుతున్నాడాయన. పన్నెండేళ్ల దాంపత్యంలో ఈ దంపతులకు ఆరాధ్య పుట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -