హీరో ధనుష్ భార్య ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్ భార్య ఐశ్వర్య స్పందించింది.
ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ” ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వస్తుంది. ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు ఇష్టం, నా పిల్లలను నేను ప్రేమిస్తున్నాను.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు” అని చెప్పుకొచ్చింది. మరోవైపు వీరిద్దరిని కలిపేందుకు సూపర్ స్టార్ రజనీ, ధనుష్ తండ్రి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా నుంచి కోలుకున్నాక వీరిద్దరితో చర్చలు జరిపి ఒకటి చేస్తామని రజినీ, ధనుష్ తండ్రి చెప్పడంతో మళ్లీ ఈ జంట కలుస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో ఐశ్వర్య వ్యాఖ్యలు అభిమానుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య ఏ ఉద్దేశంతో వ్యాఖ్యానించిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఈ జంట మళ్లీ కలుస్తుందా లేదా అనేది తెలియాలి.
స్పైసీగా ఎంట్రీ ఇవ్వబోతున్న మల్లు బ్యూటీ