Friday, March 29, 2024
- Advertisement -

మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

- Advertisement -

అలనాటి తార రాధ గుర్తిందా ? స్టార్ హీరోయిన్‌గా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు. చాలా కాలంగా సినిమాలకు దూరంలో తన కుటుంబంతో ఏకాంత జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మళ్లీ రాధ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇప్పుడివే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు తల్లిగా ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ రాధ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒకప్పటి అందాల హీరోయిన్స్‌కు త్రివిక్రమ్ తన సినిమాల్లో తల్లి. అత్త వేషాలివ్వడం ఆచారంగా వస్తోంది.

ఇప్పటికే ‘నదియా, టబు, ఖుష్బూ’ లాంటి నిన్నటి తరం హీరోయిన్స్ ఆయన సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు వారి లిస్ట్ లోకి రాధ కూడా చేరనుండడం హాట్ టాపిక్ అయింది. నైంటీస్ లోనే సినిమాలకి గుడ్ బై చెప్పిన రాధ.. మహేశ్ చిత్రంతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. తన ఇద్దరు కూతుళ్ళు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుండడం మరో విశేషం.

Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -