టాలీవుడ్లో కాలం కలిసి రాలేదని బాలీవుడ్కు పోతే అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. చివరికి అక్కడ ఫ్లాపు మూటగట్టడంతో రకుల్ప్రీత్సింగ్ ఆందోళనలో పడి పోయింది. తెలుగు ఇండస్ట్రీని కాదని.. బాలీవుడ్ కు వెళ్లిన రకుల్కు ఆశలన్నీ అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. ఆమె నటించిన `అయ్యారీ` సినిమా వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఫిబ్రవరి 16వ తేదీన విడుదలయ్యింది. కానీ ఆ సినిమా డిజాస్టర్గా పేరు పడడంతో థియేటర్లకు జనం రావడం లేదు. దీంతో రకుల్ను ఐరన్ లెగ్ అనేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అపజయం అంటూ లేని నీరజ్ పాండే దర్శకుడిగా సినిమాను తీశాడు. కానీ ఏం చేస్తాం.. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో నెగిటివ్ టాక్ వచ్చేసింది. దానికి తోడు ఓపెనింగ్స్ కూడా ఆశించినంత రాలేదు.
కథ బాగానే ఉన్నా.. దాన్ని డీల్ చేసే విధానంలో మాత్రం నీరజ్ పాండే గాడి తప్పడంతో సినిమా పరాజయం పొందే బాటలో ఉంది. ఎప్పుడూ స్క్రీన్ ప్లేతోనే కట్టిపడేసే నీరజ్ ఈసారి మిస్సవడంతో ఫలితం తీవ్రంగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేడా కొడుతోంది. ఎన్నో ఆశలతో బాలీవుడ్కు రీ ఎంట్రీ ఇచ్చిన రకుల్కు అయ్యారీ సినిమాతో మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్టు తయారయ్యింది. హిందీలో ఆశలు పెట్టుకుని ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమను విమర్శించిన రకుల్ ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తుంది. ఎలా టాలీవుడ్లో మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సరైన కథలు రావట్లేదని.. అందుకే బాలీవుడ్లో నటిస్తున్నానని చెప్పిన రకుల్ ఇప్పుడు ఏం చేస్తదో చూడాలి.