- Advertisement -
అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’.అమ్మాయిల చుట్టూ తిరిగే కుర్రాడు రోమియో అవుతాడు. వాళ్లకు నచ్చితే ప్రేమియో అవుతాడు. మరి మజ్ను అయ్యాడంటే కచ్చితంగా ఏదో ఓ కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే బిగ్ స్క్రీన్పైనే చూడాలి. నిధీ అగర్వాల్ కథానాయిక. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ రొమాంటిక్ లవ్స్టోరీ షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ సినిమాను రిపబ్లిక్ డే వారంలో జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇందులో అఖిల్ ప్లే బాయ్గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.