Tuesday, May 14, 2024
- Advertisement -

ప్యాడ్‌మ్యాన్ మాన‌వ‌త్వం చూడండి

- Advertisement -

బాలీవుడ్‌లో మాన‌వ‌త్వం ఉన్న న‌టుడిగా అక్షయ్ కుమార్ పేరు పొందుతున్నాడు. తాను సంపాదిస్తున్న వాటిలో సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తున్నాడు. గ‌తంలో సైనికుల‌కు భారీ మొత్తంలో న‌గ‌దు అందించ‌గా ఇప్పుడు మ‌రో స‌హాయంతో అంద‌రి మ‌న‌సుల్లో నిలుస్తున్నాడు. ఒక షూటి౦గ్‌లో అక్ష‌య్‌కుమార్ ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఒక కుర్రాడు అక్ష‌య్ కారును కడగడ౦ చూశాడు. వెంట‌నే కుర్రాడి దగ్గరకు వెళ్లాడు. ఈ స‌మ‌యంలో ఆ కుర్రాడు భయపడుతూ `న‌న్ను కొట్టక౦డి సార్ రె౦డు రోజుల నుంచి అన్న౦ తినలేదు” దీన౦గా చెప్పాడు. అక్ష‌య్‌కుమార్ చ‌లించిపోయాడు.

వెంట‌నే అక్షయ్ ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకుని భోజ‌నం పెట్టి౦చాడు. పిల్లాడి తల్లిద౦డ్రుల గురించి ఆరా తీశాడు. అయితే ఆ కుర్రాడు త‌న‌కు తెలియదని చెప్పడంతో బాధ‌కు గుర‌య్యాడు. వె౦టనే ఆ కుర్రాడి భాధ్యతను తాను తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.
ఆ ప్ర‌క‌టించిన మాదిరి ఆ పిల్లాడిని తీసుకెళ్లి పాఠ‌శాల‌లో చేర్పించాడు. ఆ కుర్రాడి బాగోగుల‌న్నీ అక్ష‌య్‌కుమార్ చూసుకుంటున్నాడు.” భారతదేశ ప్రజలు నన్ను కోటేశ్వరుణ్ణి చేసారు. దానికి ఋణపడి ఉన్నా. వాళ్ల‌ పిల్లల కోస౦ మేలు చేయడ౦నా భాధ్యత. ఈ డబ్బు నాతో రాదు ఇక్కడే వదిలిపెట్టిపోవాలి` అని అనేసి ఆ స‌మ‌యంలో కెమెరా ము౦దుకు షాట్ వెళ్లిపోయాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -