Monday, April 29, 2024
- Advertisement -

ముగ్గురు స్టార్ హీరోలకు నోటీసులు!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోలకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులు కంపెనీల్లో నటించిన షారుఖ్ ఖాన్‌తో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్‌లకు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీలకు ప్రకటనలు ఇస్తున్న నటీనటులు, ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే కోర్టుల్లో పిటీషన్లు దాఖలు అయ్యాయి. అయితే అందులో కొంత మంది నటులు వెనక్కు తగ్గారు. కాని మరికొంత మంది స్టారస్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు.

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20న ఈ నోటీసులు జారీ చేయగా ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే తెలియజేశారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ రాజేష్‌సింగ్‌ చౌహాన్‌తో కూడిన ధర్మాసనం గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 22వతేదీన ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదించారు. దాంతో అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పాండే తెలిపారు.

గతంలో ఈ విషయంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వెనక్కు తగ్గారు. ఆయన కూడా పాన్ మసాలా ప్రకటనలో నటించారు. విమర్శలు రావడంతో ఆ కంపెనీలతో తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు బిగ్ బి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -