రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కిన చిత్రం కాంతార. భారతీయ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈ మూవీ ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్ త్వరలో రానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రీక్వెల్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కు సంబంధించి డేట్ , టైంని లాక్ చేశారు. నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 నిమిషాలకి కాంతార పార్ట్ 1 ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది కేవలం వెలుగు మాత్రమే కాదు అది దర్శనం అంటూ లైన్ పెట్టారు. దీంతో ఈ సినిమా ఎంత డివోషనల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని తెలుస్తోంది.
రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా పాన్ ఇండియా లెవల్లో రిలీజైనీ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది. మరి ఈ ప్రీక్వెల్తో రిషబ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి..