“అల్లరి” సినిమాతో వెండితెరపై నవ్వుల పూలు పూయించిన నటుడిగా గర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. అయితే, గత కొంత కాలంగా ఆయనకు సరైన హిట్ లేకపోవడంతో కెరియర్ పరంగా కాస్తా వెనుకబడినట్టు కనిపించాడు. కానీ తాజాగా “నాంది” మూవీ సక్సెస్తో జోరుమీద దూసుకుపోతున్నాడు. నాంది సినిమా ప్రమోషన్లో భాగంగా జబర్ధస్త్ ఖతర్నాక్ కామెడీ షోకు విచ్చేసి రచ్చ రచ్చ చేశాడు.
జబర్ధస్త్ షోకు వచ్చిన ఈ అల్లరోడు.. అక్కడ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. అంతలా ఏం చేశాడబ్బ అనుకుంటున్నారా? సాధరణంగా అల్లరి నరేష్ సినిమాల్లో కామెడీతో వస్తుంటాయి. వాటిలో ఆయన కామెడీ పంచులు.. నటనకు కడుపుబ్బా నవ్వాల్సిందే. ఆయనకు కామెడీ సినిమాలతో పాటు వైవిధ్య స్టోరీలతో ఉంటే సినిమాలు చేయాలని ఉందని చాలా సార్లే చెప్పారు. దానికి అనుగుణంగానే నాంది చేశానని చెప్పాడు.
ఇక రోజాతో ఆ కోరిక మిగిలిపోయిందని అల్లరి నరేష్ తన కోరికను బయటపెట్టేశాడు. అది కూడా జబర్థస్త్ స్టేజీ పైనే. జబర్థస్త్ వేదికపై “వయ్యారి బ్లాకుబెర్రి ఫోనులే” అంటూ రోజాగారితో స్టెప్పులేశాడు అల్లరోడు. అ తర్వాత రోజాను అమాంత ఎత్తేశాడు. ఆవిడతో యాక్టు చేశాను కానీ హీరోగా చేయలేదంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశాడు నరేష్. రోజా మాట్లాడుతూ.. సీతారత్నం గారి అబ్బాయి సినిమా అప్పుడు అల్లరి నరేష్ స్కూల్కు పోయేవాడనీ.. అప్పుడు తాను ఎత్తుకుని అడేదాన్ని.. కానీ నేడు తనను అల్లరి నరేష్ ఎత్తుకునే స్థాయికి ఎదిగాడంటూ రోజా చెప్పింది.
దుబాయ్ పోలీస్ స్టేషన్లో హీరో మహేష్ బాబు!
నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..