దుబాయ్ పోలీస్ స్టేషల్ లో హీరో మహేష్ బాబు ఉన్నాడు. అసలు మహేష్ ఏంటి పోలీస్ స్టేషన్ ఏంటి అనుకుంటున్నారా? అవును నిజంగానే మహేష్ దుబాయ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. కానీ ఎదో కేసు విషయంలో కాదు. తను ప్రస్తుతం నటిస్తున్న సినిమా విషయం గురించి. అందులో ఉన్న ఒక సనివేశం కోసం పోలీసు స్టేషన్ కు వెళ్లాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు కలిసి తీస్తున్నారు.
ఈ సినిమ రీసెంట్గా దుబాయ్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ లపై కొన్ని సన్నివేశాలను మూవీ యూనిట్ షూట్ చేసింది.ఈ షూటింగ్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్లో భాగంగా దుబాయ్ పోలీస్ స్టేషన్ను మూవీ యూనిట్ చూపించింది.
బండ్ల గణేశ్ కు పవన్ గ్రీన్సిగ్నల్.. పూరీ డైరెక్షన్లో మూడో చిత్రం.. !