Monday, April 29, 2024
- Advertisement -

‘జైలు కొత్తకాదు.. హంతకుడన్న ముద్ర కొత్త కాదు’

- Advertisement -

టాలీవుడ్‌లో ఒకప్పుడు మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ తరువాత ఆ రేంజ్‌లో సక్సెస్‌ ఇవ్వడంలో ఫెయిల్‌ అయ్యాడు. ఆ మధ్య మహేష్ మ‌హ‌ర్షి చిత్రంలో అల్లరి న‌రేష్ న‌ట‌న చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో అల్లరి న‌రేష్ త‌న న‌ట‌న‌తో విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్లరి న‌రేష్ నాంది చిత్రంతో ఎలా అయినా హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ట్విట్టర్‌ ద్వారా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.

ట్రైలర్‌ విషయానికి వస్తే…రాజగోపాల్‌ అనే వ్యక్తిని నరేష్‌ చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తారు. తను రాజగోపాల్‌ గురించి వినడమే కానీ.. ఎప్పుడూ తనని చూడలేదని నరేశ్‌ ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోరు. నరేష్‌ను పోలీస్‌ ఆఫీసర్‌(హరీశ్ ఉత్తమన్‌), లాయర్‌(శ్రీకాంత్‌ అయ్యర్‌) హత్య కేసులో ఇరికించడానికి ప్రయత్నించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. “ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడ‌డం కోస‌మే. ప‌వ‌ర్‌లో ఉన్న‌వాడ్ని ఏం పీక‌లేవు“ అనే డైలాగ్ తో.. ఈ సినిమా క‌థేంటో అర్థ‌మైపోతుంది.

అందరూ నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ నా జీవితం ఇప్పుడు మొదలైంది అని నరేష్‌ చివరలో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ సినిమాలో నరేశ్‌ను కాపాడే లాయర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. చేయని తప్పుకు నరేశ్‌ ఐదేళ్లు జైలు శిక్షను అనుభవించడానికి కారణమేంటి? అనే విషయాలు ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాను ఫిబ్రవ‌రి 19న విడుద‌ల కానుంది.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లేటెస్ట్ అప్ డేట్!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -