రెబల్ స్టార్ ప్రభాస్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా మూవీగా సాహెూ చిత్రం రిలీజ్ అయినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీ పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కింది.
ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రతో సందడి చేయనుంది.ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే వారికి తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇవాళ రాధేశ్యామ్ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది.
“మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం” అంటూ రెబల్స్టార్ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలోనే జరుపుకున్న సంగతి తెలిసిందే.జస్టిన్ ప్రభాకరణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్లో సందడి మొదలైంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన జబర్ధస్త్ కమెడియన్..!
వెనక్కి తగ్గం అంటున్న రైతులు.. నేడు నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం..!