- Advertisement -
అల్లు అర్జున్ కొత్త సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా షుటింగ్ ఓ పాట మినహా మొత్తం పూర్తి చేసుకుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ఈ సినిమా రెడీ అవుతుంది.ఈ నెల 15న(ఏప్రిల్) ఈవెంట్కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే వెన్యూ రాజమండ్రి నా? విశాఖపట్నం నా? అన్నది డిస్కషన్ లో వుంది.నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ సీడెడ్ ఏరియాలో చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
అంటే తిరుపతి, కర్నూలుల్లో ఓ చోట చేసే ఆలోచనలో యూనిట్ వుంది.వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మాతలుగా ఉన్నారు.ఈ సినిమాలో హీరోయిన్గా అను ఇమ్మాన్యూయేల్ చేస్తుంది.ఈ సినిమాలో బన్నీ బోర్డర్లో ఆర్మీ ఆఫీసర్గా చేస్తున్నాడు.