స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య వచ్చి దాదాపు 10 నెలలు కావస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. దీంతో ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని చాలా కథలే విన్నాడు. కాని ఏ కథ కూడా బన్నికి నచ్చలేదు. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోసం చాలాకాలం వెయిట్ చేశాడు. త్రివిక్రమ్ చెప్పిన కథ బన్నికి నచ్చడంతో వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్ని. తాజాగా ఈ సినిమా షూటింగ్నే ఈ రోజే మొదలుపెట్టారు. సినిమా ముహుర్తపు షాట్ను దేవుడి చిత్ర పటాల మీద చిత్రికరించారు.
ఈ నెల 23 , 24 తేదీల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డె నటిస్తుందని సమాచారం. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నాడు బన్ని. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించనున్నాడు అల్లు అరవింద్.ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఇంకోక సినిమాలో నటించనున్నాడు బన్ని. దీని బట్టి 2020లో బన్ని మూడు సినిమాలతో సందడి చేయడం ఖాయం అని అంటున్నారు ఆయన అభిమానులు.
- Advertisement -
ఎట్టకేలకు కొత్త సినిమా మొదలెట్టిన అల్లు అర్జున్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -